తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిణామాల పై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులకే మేలు జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణవాదులకు, ఉద్యమకారులకు, కాలం చెల్లిందని అన్నారు.
ఇప్పుడు తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకుల సమయం నడుస్తోందని విమర్శించారు. తన మంత్రుల ద్వారా కేసీఆర్ చెప్పిస్తున్న కొత్త సిద్ధాంతం ఇదేనని విజయశాంతి దుయ్యబట్టారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినవారికే మేలు జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ కోసం పాటుపడిన వాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు మోదీతో..ఇప్పుడు రాహుల్ జపం