telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాపం చంద్రబాబును అందరూ వదిలేశారు : విజయసాయిరెడ్డి ఆవేదన !

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు, యనమల పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.  యనమల… ఓ చెత్త ఫైనాన్స్‌ మినిష్టర్‌ అని మండిపడ్డారు. అంతేకాదు.. తిరుపతి ప్రచారంలో బాబు ఒంటరి అయిపోయాడని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. “జగన్ గారు ప్రమాణం చేసే నాటికి ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిలాయి. దొరికిన చోటల్లా మేమే అప్పులు తెచ్చాం. ఇంకెక్కడా రూపాయి అప్పు పుట్టదు అని పబ్లిగ్గానే చెప్పిన యనమలకు శ్వేత పత్రం కావాలట. ఆర్థిక నిర్వహణలో దేశంలోనే చెత్త ఫైనాన్స్ మినిష్టర్ ఇలా డిమాండు చేయడం వింతగా లేదూ?మీ ఉడత ఊపులు, తొండ తోపులు, పిల్లి అరుపులకు ఎవరూ భయపడిపోరు. కర్ర వంకర పొయ్యి తీర్చేస్తుంది. అక్షరం- ఆయుధం అంటూ వక్రభాష్యాలు నడవవు. మీ దమ్ము- దుమ్ము, మన్నూ – మశానం ఆటలన్నీ చంద్రబాబు దగ్గరే. బరితెగిస్తే బడితపూజే. ” అంటూ ఫైర్‌ అయ్యారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్‌లో “తలుపులు తడతారంటూ వాలంటీర్లను అవమానించిన చంద్రబాబు ముఖంపై జనమే తలుపులేస్తున్నారు. ఢిల్లీనే వణికించానని చెప్పుకునే వాడి తిరుపతి గల్లీ ప్రచారంలో పట్టుమని పదిమందీ కనిపించడం లేదు. 15 మంది సెక్యూరిటీ, పది మంది అను “కుల’ మీడియా, ఒక గల్లీ నేత, పీఏలు, అచ్చెన్న తప్ప అందరూ బాబును వదిలేశారా?” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

Related posts