telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లోకేశ్ ఓ దద్దమ్మ.. లాగి కొడితే పొలిటికల్ చాప్టర్ క్లోజే !

టిడిపి పార్టీ, నారా లోకేష్, చంద్రబాబు పై మరోసారి వియసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “లోకేశ్ లాంటి దద్దమ్మ ఇంకో రాష్ట్రంలో ఉంటే, సర్పంచుకు దక్కే గౌరవం కూడా దొరికేది కాదు. ఇక్కడ అను’కుల మీడియా జాకీలతో లేపి ఎలివేషన్లు ఇవ్వడం, అక్రమంగా పోగేసిన లక్షల కోట్ల తలబిరుసుతో చెలరేగుతున్నాడు. మంగళగిరి బాదుడులాగా ప్రజలు ఇంకోసారి లాగి కొడితే పొలిటికల్ చాప్టర్ క్లోజవుతుంది. సభ్యతా సంస్కారం లేని నేతలకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు. పిల్ల ‘కూనే’మో ఆముదాలవలస రోడ్లపై స్పీకర్ గుడ్డలూడదీయిస్తానంటాడు. ‘అచ్చో’సిన ఆంబోతేమో నీచాతినీచంగా పేలతాడు. కాబోయే హోం మంత్రినే టచ్ చేస్తారా అంటూ బిల్డప్. సిక్కోలు ప్రజలు ఛీ కొడుతున్నా-నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటున్నారు. స్టింగ్ ఆపరేషన్ లో అచ్చెం బొచ్చం నాయుడు అసలు రంగు బయటపడింది. దీంతో తన బాస్ ఎక్కడ తంతాడోనన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. చిన్న బాస్ పప్పు నాయుడు మొప్పుకోసం సభ్యత, సంస్కారం గాలికొదిలేసిన ఈ చట్నీ నాయుడు శవరాజాకీయాలు చేస్తున్నాడు. పాతాళంకన్నా దిగువకు దిగజారిన ఇతడ్ని ఎవరూ లేపలేరు. తమిళునాడు నుంచి రప్పించి దొంగ ఓట్లు ఎలా వేయించాలో కుప్పం తుప్పు నాయుడుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఆ అనుభవంతోనే ఎల్లో మీడియాలో డ్రామాలు. డిపాజిట్ దక్కించునేందుకు పాట్లు. తిరుపతి రోడ్లపై బస్సుల్లో వెళ్తున్నవారిపైనా మీ ప్రతాపం? టీడీపీ ఏజెంట్లు ఒక్క దొంగ ఓటరునైనా పట్టుకున్నారా?” అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

Related posts