telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు !

ఇవాళ టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఆవిర్భావ సంబరాలు జరుగుతున్నాయి. అయితే.. టీడీపీ ఆవిర్భావ వేడుకలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైటెర్‌ వేశారు. “పార్టీ వ్యవస్థాపకుడ్ని 13 ఏళ్లలోనే పాతేసి…26 ఏళ్ల తర్వాత పార్టీనే పాతేసి…ఓడిన కొడుకుతో పరాయి రాష్ట్రంలో ఏకాంతవాసం చేస్తున్న తుప్పుకు…పార్టీ అంతర్థాన దినోత్సవ శుభాకాంక్షలు! తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్‌లో “ప్రత్యేక హోదా వద్దని అప్పటి సీఎం కమిట్ అయినందునే ఇవ్వలేదని కేంద్ర మంత్రి పార్లమెంటులో చెబితే కనీసం నోరు మెదపలేని దరిద్రం ఏమిటి బాబూ? అప్పట్లో కేంద్రానికి నువ్వు చేసిన ఊడిగం వల్ల పారిశ్రామిక ప్రగతి నిల్చిపోయి యువత తీవ్రంగా నష్టపోయింది.” అంటూ చంద్రబాబు విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు.

Related posts