telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తెలంగాణలో అయిపోయింది…ఏపీలో టీడీపీని బంగాళాఖాతంలో కలపడమే !

తెలంగాణ టీడీపీ శాసనసభ పక్షం తెరాస లో విలీనమైంది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరియు మచ్చా నాగేశ్వర్ రావు టీడీఎల్పిని టీఆరెస్ లో విలీనం చేస్తున్నట్లు…తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాసారు. అంతేకాదు.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు ఇద్దరు ఎమ్మెల్యే. అయితే.. టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. TRSలో తెలంగాణ TDP విలీనమైందని.. AP టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాలసిందేనని ఎద్దేవా చేశారు. “TRSలో తెలంగాణ TDP విలీనమైంది, TDLPని మూసేశారు. AP టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాలసిందే. లేకపోతే కృష్ణార్పణమో, గోదావరిలో నిమజ్జనం చేస్తారా? పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రంకు ఇక నిరాశా, నిస్పృహే. చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు? జగన్ గారు ఎన్ని ఉద్యోగాలిచ్చారో మీ బాబును, కుల మీడియాను అడుగు మాలోకం. నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా. చిన్న మెదడు డ్యామేజి అయినోడివి ఏదైనా అంటావు. ఖర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టికి నువ్వో ‘పెద్ద’ నాయకుడివి. జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే. “అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

Related posts