telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు : విజయసాయిరెడ్డి ట్వీట్

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, చంద్రబాబులపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. “నిమ్మగడ్డ తన చుట్టూ ఉన్న ఎవర్నీ నమ్మడం లేదు.మంగళగిరిలోని టీడీపీ ఆఫీసే ఆయన బ్యాక్ ఆఫీసు! ‘ఈ వాచ్’ యాప్ తయారైంది అక్కడే. లేఖలు, ఆర్డర్ కాపీల డ్రాఫ్టింగ్ అక్కడే. తన తరపున వాదించే లాయర్ల ఏర్పాటు అంతా పచ్చ పార్టీదే. ఎంత స్వామి భక్తి ఉన్నా…ఇంత బరితెగింపా? భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు! నేను కొట్టినట్లు నటిస్తా – నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం. సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలిగానీ – టీడీపీ మ్యానిఫెస్టోను నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము!” అంటూ ఫైర్‌ అయ్యారు. ఇక అంతకు ముందు ట్వీట్‌లో “కేంద్ర పెద్దల దగ్గర టీడీపీ ఎంపీలు పితూరీలు చెప్పినా వారి పప్పులడకలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చిన చోటే హైకోర్టు పెట్టుకోవచ్చని న్యాయశాఖ మంత్రి తేల్చేశారు. హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం. ఏకగ్రీవాలను అడ్డుకుని కక్షలు, కార్పణ్యాలను రగిల్చి గ్రామాల్లో ఐకమత్యం లేకుండా చేయాలన్నది చంద్రబాబు కుట్ర. చెంప చెళ్ళుమనిపిస్తూ…ఆయన సొంత జిల్లా చిత్తూరులోనే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కుప్పంలోనూ కూసాలు కదిలిపోతున్నాయి.” అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Related posts