టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి పై విమర్శలు గుప్పించారు. పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారు.
ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా. మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని ట్విటర్ లో పేర్కొన్నారు.