telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారు… ఇకపై అలాంటివి సాగవు: విజయసాయి రెడ్డి

Vijayasai reddy ycp

అమరావతిలోని ప్రజావేదికను కూల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారని, ఇకపై అలాంటివి సాధ్యం కావని అన్నారు. నదీగర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.

ఈ అక్రమ కట్టడాలు ఇల్లు లేని పేదలు కట్టుకున్నవి కాదని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవని చెప్పారు. విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని అందువల్లే వాటి పనులు మొదలు కాలేదని విజయసాయి రెడ్డి విమర్శించారు.

Related posts