telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొమ్ములతో కుమ్ముకుంటూ ముందుకు దూసుకుపో అచ్చెన్నా : విజయసాయిరెడ్డి

టిడిపి పార్టీ పై విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కుల పిచ్చతో చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని కోల్పోయాడని విజయసాయిరెడ్డి. “కుల పిచ్చితో అడ్డమైన అరాచకాలు చేసి చంద్రబాబు తన రాజకీయ పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. మతం పేరుతో విభజన తీసుకురావాలని ఆరాటపడుతున్న వాళ్ల గతీ అంతే. పోలింగుకు రెండ్రోజుల ముందు దాకా గురుమూర్తి మతం ఏమిటో తెలియదా మీకు? మీకంటే నిఖార్సైన హిందువు ఆయన. ” అంటూ తెలిపారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్ లో అచ్చెన్నాపై కౌంటర్ వేశాడు విజయసాయి రెడ్డి. “ఉన్న మాటే అన్నావ్. బొక్కలో పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అని చిటికెలు వేసేయ్. మధ్యలో లోకేశ్ చంకలో దూరడం ఎందుకు. ఎద్దంత మనిషివి భయపడితే ఎలా అచ్చెన్నా. కొమ్ములతో కుమ్ముకుంటూ ముందుకు దూసుకుపో. ఏదో ఒక పార్టీ చేరదీస్తుంది. అప్పుడు నీ హోం మంత్రి కల నెరవేర్చుకో. ప్రచారం ముగియకుండానే మాలోకం అలిగి హైదరాబాద్ వెళ్లి పోవడం, చంద్రబాబు తన శాలువాలు తనే కప్పుకుని స్వీయ సత్కారాలకు పాల్పడటం…! ఎక్కడో తేడా కొడుతోంది. అచ్చెన్న, బుచ్చయ్యలకు బాగా తెలుసు అదేంటో. “అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

Related posts