వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ఒక్క కేసు నుంచి కూడా తప్పించుకోబోవని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. “నీ మానిప్యులేషన్, మీడియా రాజకీయాలు నడవవు చంద్రబాబూ. YCP పాలనలో అక్రమాలు, అరాచకాలంటూ రోజూ ప్రెస్ మీట్లు, పచ్చ మీడియాలో డిబేట్లు. రెండేళ్లలో TDP ఓటింగ్ 10 శాతం తగ్గింది. 39 నుంచి 29కి పడింది. బాబు పార్టనర్ జనసేనకు 6 నుంచి 4కు చేరింది. అవినీతికి పాల్పడి నానాఅడ్డదారులు తొక్కే బదులు ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం. చట్టం ముందు నిలబడే దమ్ముందా అసలు? సిగ్గులేకుండా వందోసారి స్టే కోసం ప్రయత్నం. ప్రజా కోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవు. ఎమ్మెల్యేగానూ నీకు ఓటమి తప్పదు. నీకు ఇల్లే జైలు అయిపోతుంది.” అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
previous post