telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబుకు ‘జోక్ ఆఫ్ ఆప్ ద ఇయర్-2021’ అవార్డు ఇవ్వాల్సిందే…!

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట‌ర్‌ లో ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు ‘జోక్ ఆఫ్ ఆప్ ద ఇయర్-2021’ అవార్డు దక్కిందంటూ ఎద్దేవా చేశారు. “కుప్పంలో కుప్పతొట్టిలో విసిరేసారు. హిందూపూర్ లో హూనం చేసి వదిలారు. మంగళగిరిలో మట్టి నాకించారు జనం. టెక్కలిలో టెంక తీసి తరిమారు. అమరావతి మండలంలో అట్లకాడలతో వాతలు పెట్టారు అక్క చెల్లెమ్మలు. పెందుర్తిలో బండ’కేసి బాదారు. ఇక ‘జయము జయము చంద్రన్నా’ సాంగ్ వేసుకోవడమే.” అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక అంతకు ముందు ట్వీట్‌లో “ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ప్రచారానికి కుప్పం వెళ్తున్న చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించాలి. రెండు చోట్ల పోటీ చేయబోనని క్లారిటీ ఇవ్వాలి. ఓడించినందుకు ప్రజలను నిందించకుండా సరైన తీర్పు చెప్పారని క్షమాపణ వేడుకోవాలి. ఇంకా ఫిబ్రవరి నెలలోనే ఉన్నా ‘జోక్ ఆఫ్ ఆప్ ద ఇయర్-2021’ అవార్డు ప్రకటన పూర్తయింది. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో 1136 గ్రామాలు గెల్చుకున్నామని మీడియా సమావేశం సాక్షిగా వెల్లడించిన చంద్రబాబుకు ఈ అవార్డు దక్కింది. మిగతా పోటీదారులెవరూ ఆయనకు దరిదాపుల కూడా రాలేకపోయారు. ” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Related posts