telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చిన్నమెదడు చిట్లిందా అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్‌!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, నిమ్మగడ్డలను విజయసాయిరెడ్డి టార్గెట్‌ చేశారు.   చిన్న మెదడు చిట్లిపోయి చిత్ర విచిత్ర డిమాండ్లు చంద్రబాబు చేస్తున్నారని తాజాగా మండిపడ్డారు విజయసాయిరెడ్డి. “కుట్రలతో నిమ్మగడ్డ, చంద్రబాబు మోకాలడ్డాలనుకున్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పల్లెల్లో గడప గడపకూ రేషన్. స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ఎన్నికలు జరిగినా రేషన్ ను ఎవరూ అడ్డుకోలేదు. పేదల తిండి గింజల్ని సైతం అడ్డుకున్నారంటే. వారికి జనం అంటే ఎంత కడుపుమంటో అర్థం చేసుకోవచ్చు. చిన్న మెదడు చిట్లిపోయి చిత్ర విచిత్ర డిమాండ్లు చేస్తున్నాడు చంద్రబాబు. ఎన్నికల కౌంటింగ్ మండల కేంద్రాల్లో జరపకపోతే కోర్టుకెక్కుతాడట. టీడీపీ ఆఫీసుల్లోనో, కరకట్ట మీదున్న నీ అక్రమ కట్టడంలోనో కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేయకపోయావా? ప్లేస్ మారితే లెక్కమారుతుందా? గెలిచింది 39.52 శాతం పంచాయతీలా లేక 39 చోట్లా? మీ ఎమ్మెల్యేలున్న ఎక్కడైనా 10 శాతం పంచాయతీలు గెలిచారా బాబూ? ఎన్నికల తర్వాత వైసీపీ కండువాతో అభిమానుల జాబితాను మేం విడుదల చేస్తున్నాం. కాకిలెక్కలు మాని గెలిచిన మీ మద్దతుదారుల పేర్లైనా ప్రకటించగలరా?” అంటూ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. 

Related posts