telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బాబు తుప్పలు పట్టుకుపోయాడు : విజయసాయి రెడ్డి

“పంచాయతీ తుది దశ పూర్తయ్యే సరికి తుప్పలు పట్టుకుపోయాడు తుప్పు నాయుడు అంటూ చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగరహం వ్యక్తం చేసారు. ఈ నకిలీ నాయుడు ప్రచారం చూసి జనమే గుణపాఠం చెప్పారు. వైఎస్ఆర్సీపీ పేరుతో నకిలీ వెబ్ సైట్ పెట్టి నైజీరియా మోసగాళ్ళ ముఠా స్థాయికి దిగజారాడు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీకి ఇంతకంటే పరాభవం తప్పదు. పంటలకే కాదు విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు, నగర దాహార్తిని తీర్చేందుకు…పోలవరం నుంచి నీరు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో చారిత్రక ఘట్టాలే ఇందుకు సాక్ష్యం. 60 రోజుల్లోనే 192 గడ్డర్ల ఏర్పాటు పూర్తి. భారీ వరదలొచ్చినా పనులు ఆగవు.” అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్‌లో  “విశాఖలో సునామీలు, భూకంపాలంటూ హడావుడి చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పైనా విషం చిమ్ముతోంది. ఈ రాతల వెనుకున్న అజెండా ప్రజలకు తెలియదా! కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేయాలంటూ ప్రచారం చేసే కరపత్రికల స్థాయికి కుల మీడియా దిగజారడం పాత్రికేయలోకానికే సిగ్గుచేటు.” అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చూడాలి మరి దీనికి బాబు ఎలా సమాధానం ఇస్తారు అనేది.

Related posts