telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మదనపల్లి దంపతుల్లాగే… సత్యలోకంలో ఉన్నాడు ఈ చంద్రగిరి నాయుడు !

vijayasaireddy ycp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏకంగా మదనపల్లి జంట హత్యలతో చంద్రబాబు పోల్చేశారు విజయసాయిరెడ్డి. “అమ్మకు అన్నం పెట్టనోడు – చిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తాడట! అధికారంలో ఉన్నప్పుడు గజం స్థలానికి టికానా లేదు. ఆ మదనపల్లి దంపతుల్లాగే సత్యలోకంలో ఉన్నాడు ఈ చంద్రగిరి నాయుడు. తన పిచ్చిని ఎల్లో కుల మీడియాకు పూర్తిగా ఎక్కించేశాడు. ఏ రోటికాడ ఆ పాట – ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే. డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తేనే తాను సీఎంగా ఉన్నప్పుడు చిందులేశాడు. ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట ? మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!” అంటూ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు.

Related posts