రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గాంధీ నగర్ లో మురికివాడలో పర్యటించారు. మురికివాడాలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న విజయసాయి రెడ్డ అనంతరం వారితో మాట్లాడారు. మురికివాడలో ప్రజల సమస్యలు విన్నానన్న ఆయన ఈ ప్రాంతంలో మహిళలు ఎదురుకుంటున్న సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. బాత్ రూమ్ లు కట్టించి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. రైల్వే మినిస్టర్ కలెక్టర్ తో మాట్లాడి ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని ఆయన అన్నారు. అవసరమైతే రైల్వే వారికి వేరే ప్రాంతం కేటాయించి ఈ ప్రాంతాన్ని ప్రజలకే కేటాయించేలా చేస్తామని ఆయన అన్నారు. పేదవాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికే వైసిపి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. మంచి నీళ్ల సమస్యలు ఇకపై ఉండకుండా చూస్తామని హామీ ఇస్తున్నానని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక వాలంటీర్ లు వాళ్ల జీవితాన్ని త్యాగం చేసి విశేష సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. వాళ్ళు పధకాల విషయంలో మీకు సహాయం చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఇవ్వి అన్ని ఎప్పటికి జరుగుతాయి అనేది.
previous post
next post
రాజధాని పేరుతో రైతులను ముంచారు: మంత్రి బొత్స