టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనమండలిలో ఏదో సాధించారని పూల వర్షం కురిపించినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట అని ఎద్దేవా చేశారు. రాజధాని సంగతి దేవుడెరుగని… ఇప్పుడు మండలికే ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారని ఆయన ట్వీట్లు చేశారు.
మరోవైపు, మండలి రద్దు చేయాలనే ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. శాసనసభలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పాస్ అవుతున్న బిల్లులకు, మండలిలో ఎదురుదెబ్బ తగులుతుండటంతో మండలి రద్దుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు అసెంబ్లీని సైతం పొడిగించింది.