telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

విజయనిర్మల అంతిమ యాత్ర ప్రారంభం

Vijaya-Nirmala

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, సీనియర్‌ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల అంతిమ యాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలోని స్వగృహం నుంచి చిలుకూరులోని విజయగార్డెన్స్‌కు అంతిమ యాత్ర మొదలైంది. ఈ అంతిమ యాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్ బాబు పాల్గొన్నారు.

వేలాది మంది అభిమానులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు తరలివచ్చారు. దీంతో నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడలో భారీగా ట్రాఫిక్ కు అంతరాయమేర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయనిర్మల అంత్యక్రియలు 11.30 గంటలకు జరగనున్నాయి.

Related posts