telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఎన్నికల అధికారి ద్వివేది బదిలీ

ap election officer altered

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం పలువురు ఉన్నతాధికారులు బదిలీ అవుతున్నారు. మరికొంత మంది అధికారులకు పదోన్నతులు కలిపిస్తున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ నూతన సీఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఈవో ఆర్పీ సిసోడియా ఆకస్మికంగా బదిలీ చేసి ఆ స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే.

Related posts