తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మరోసారి విమర్శలు గుప్పించారు. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పట్టణంలో సింహగర్జన పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేయడం నీ జేజమ్మ తరం కాదని పేర్కొన్నారు.
ప్రస్తుతం వెళ్లేవారు వెళ్లిపోతున్నా కాంగ్రెస్లోకి యువరక్తం వస్తోందన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారంటూ చిన్నదొర చెప్పే మాటలు ఎవరూ నమ్మరని అన్నారు. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్ తనవైపే ఉన్నారంటూ కేసీఆర్ చెబుతున్నారే కానీ ఏనాడైనా వారు తెలంగాణకు వచ్చారా? అని విజయశాంతి ప్రశ్నించారు.