telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేశ్‌ తెలివి 8వ తరగతి పిల్లాడికి మించదు!

ఏపీ సీఎం నారా చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్‌ తెలివి 8వ తరగతి పిల్లాడికి మించదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లతో తండ్రి కొడులకులపై విమర్శనస్త్రాలు సంధించారు. తెలివి నిర్ధారించడానికి ఐక్యూ పరీక్షలు ఉంటాయని, మంత్రి లోకేశ్ ఐక్యూ లెవల్ 8 వ తరగతి పిల్లాడికి మించదన్నారు. తండ్రి దోచుకున్న సంపద లేక పోతే పప్పునాయుడుకి కనీసం రూ.10 వేల జీతమిచ్చే ఉద్యోగం కూడా దొరికేది కాదన్నారు. లోకేశ్‌ను ఏదైనా ఒక జిల్లాలోని అసెంబ్లీ స్థానాల పేర్లు చెప్పమనండని ప్రశ్నించారు.

ఉమమహేశ్వర్‌ రావు అనే అసమర్థ మంత్రికి ఎప్పుడూ పీడ కలలే వస్తుంటాయని, రాజధాని ఇడుపులపాయకు తరలిపోతుందనే కొత్త కల కన్నాడని ఎద్దేవా చేశారు. అసలు మీ ప్రభుత్వం రాజధాని కడితే గదా ఇంకొకరు మార్చేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ భ్రాంతిలోనుంచి ఉమా బయటకు రావాలని సూచించారు. చంద్రబాబు డేటా చోరీ స్కాం దేశంలోనే పెద్ద సైబర్ సాబోటేజ్ క్రైమని, రహస్య సమాచారాన్ని బజారులో పడేశారని ధ్వజమెత్తారు.

Related posts