telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

టీడీపీ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి…

టీడీపీ పార్టీ 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ”పార్టీ వ్యవస్థాపకుడ్ని 13 ఏళ్లలోనే పాతేసి…26 ఏళ్ల తర్వాత పార్టీనే పాతేసి…ఓడిన కొడుకుతో పరాయి రాష్ట్రంలో ఏకాంతవాసం చేస్తున్న తుప్పుకు…పార్టీ అంతర్థాన దినోత్సవ శుభాకాంక్షలు!” అని విజయ సాయి రెడ్డి అన్నారు. అలాగే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థులే చేతులెత్తేస్తుంటే వారికి జాకీలుపెట్టి ఎలా లేపాలో అర్థంకాక సతమతమవుతోంది పచ్చ కుల మీడియా. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మీరెన్ని చేసినా డిపాజిట్లు వస్తే చాలాఎక్కువ.స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తయ్యాక క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికే టీడీపీ టికెట్లంటూ కొత్త రాగం అందుకున్నారు కరకట్ట తండ్రీకొడుకులు. అలాగైతే ముందుగా ఎగిరిపొయ్యేది ఆ తండ్రీకొడుకులే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా? లేదా హైదరాబాద్ లో ఉండే వారికి ఈ రూల్ వర్తించదా?. అర్చక కుటుంబాలతో చంద్రబాబు ఆటలాడుకున్నాడు. అడ్డదిడ్డమైన నిబంధనలతో హింసించాడు. తిరుమల మిరాశీ కుటుంబాలకు భరోసానిచ్చారు జగన్ గారు. అర్హత ఉన్నవారికి స్వామి వారి సేవకు అవకాశం కల్పించారు. విగ్రహాలు పగులగొట్టించే చంద్రబాబుకేం తెలుసు స్వామివారి సేవల విలువ? అని పేర్కొన్నారు.

Related posts