మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో అరంగేట్రం గురించి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. జాలరుల కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో వైష్ణవ తేజ్ కనిపించనున్నాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన విలన్ పాత్రకి విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతాడనీ, ఈ సినిమాతో .. ఈ తరహా పాత్రలతో తెలుగులోనూ ఆయన బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.