telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కియా తరలింపుపై అసత్య వార్త రాయించారు: జయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

రాయిటర్‌లో వచ్చిన ‘కియా తరలింపు’ కథనం పై ఏపీలో విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆయన పలు ఆరోపణలు గుప్పించారు. కియా తరలింపుపై ఆయనే రాయిటర్‌లో అసత్య వార్త రాయించారని విజయసాయిరెడ్డి అన్నారు.

‘ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు. అన్నింటికి తెగబడి పోయాడు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Related posts