telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రథం దగ్ధంపై చంద్రబాబు కమిటి..విజ‌య‌సాయి విమర్శలు

vijayasaireddy ycp

తూర్పుగోదావ‌రి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో స‌భ్యులుగా నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావును నియమించారు. కమిటీ స‌భ్యులు అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి చంద్రబాబుకు నివేదిక అందిస్తారు.

చంద్రబాబు వేసిన కమిటీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.”అంత‌ర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడని విజ‌య‌సాయి దుయ్యబట్టారు.

Related posts