టీడీపీ గ్లేమ్ ప్లాన్ లో భాగంగానే ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ కీలుబొమ్మలా మారిపోయారని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. “తెలుగుదేశం ప్రభుత్వం తప్పుదారి పట్టించినందునే ఇప్పుడు పవన్ నిశబ్దంగా ఉన్నారు.
చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మలా పవన్ వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వసూలయ్యే పన్నును ఆదా చేసేలా సాగుతున్నాయి. పారదర్శకతపై దేశానికే ఆదర్శంగా నిలిచి, ఓ దిశను చూపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు ఏదైనా విమర్శలు చేసేటప్పుడు ముందూ, వెనుకా ఆలోచించాలని విజయసాయి హితవు పలికారు.