telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ క్రేన్ ప్రమాదంపై శాఖాపరమైన విచారణ: విజయసాయిరెడ్డి

vijayasaireddy ycp

విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ కుప్పకూలి 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ దుర్ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి పట్ల తన హృదయం చలించిపోయిందని అన్నారు. వారు ఈ విషాదం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు. ఈ ఘటనలో శాఖాపరమైన విచారణ షురూ అవుతుందని వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారకులు ఎంతవారైనా వదిలిపెట్టరాదని పేర్కొన్నారు.

Related posts