బీహార్ దాణా కుంభకోణం కంటే టీడీపీ హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఇటీవల వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై విజయసాయిరెడ్డి ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టామని ఆయన అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగలడం తనకు ఆశ్చర్యం కలిగించడం లేదని ఆయన అన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన బిల్లులు ఆమోదం పొందుతున్నప్పుడు టీడీపీ సభ్యులు ఆందోళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు తన హయాంలో ఏపీకి ఒక్క మంచి పని కూడా చేయలేదనీ, ఇప్పుడు సీఎం జగన్ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ట్విట్టర్ లో విమర్శించారు.
పీవీ కూతురును…మరో శంకరమ్మను చేయబోతున్నారు..