telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు ఆర్టీసీ భూములను తన వాళ్లకు ఇచ్చారు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ లో ధ్వజమెత్తారు. ప్రైవేటు ఆపరేటర్ల ప్రయోజనాల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారని విమర్శించారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములను తనవాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణం కోసం లీజుకు ఇప్పించారని ఆరోపించారు.

గతంలో ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు ఆర్టీసీని మూసివేత దశకు తీసుకెళ్లారని దుయ్యబట్టారు. కానీ సీఎం జగన్ మాత్రం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనీ అన్నారు. మూసివేత దశలో ఉన్న ఆర్టీసీకి తిరిగి జగన్ ఊపిరి పోశారని ట్విటర్ లో ప్రశంసించారు.

Related posts