టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో వేల ఎకరాల భూములు కొన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ భూముల ద్వారా వచ్చే లాభాలను విదేశాలకు తరలించాలన్న తలంపు వారిదని దుయ్యబట్టారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు.
విశాఖ పరిపాలనకు అనుకూలంగా ఉందనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విజయసాయిరెడ్డి చెప్పారు. అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొడుతూ.. విశాఖను పరిపాలన కేంద్రం చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేయాలనే తలంపు టీడీపీ నేతల ఆలోచనల్లో కనిపిస్తోందన్నారు.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్రెడ్డి