telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అందుకే చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. కరకట్ట లోపల నిర్మించిన తన ఇంటికి వరద ముప్పు ఉందని తెలుసుకున్న చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

అంతేకాకుండా ఆయన ఇంటిలోని కార్లు, ఇతర విలువైన వస్తువులను మరోచోటికి తరలించారని వ్యాఖ్యానించారు.చంద్రబాబు గారి కష్టాలు పగవాడికి కూడా రాకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో ఇప్పుడైనా అర్థమయిందా చంద్రబాబు గారూ? అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Related posts