telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు నెలలకే బట్టలు చించుకుంటే.. మిగిలిన ఐదేళ్లు చంద్రబాబు ఎలా తట్టుకుంటారో!

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. తిరుమల ఆర్టీసీ బస్ టికెట్ల ద్వారా అన్యమత ప్రచారం జరుగుతోందని టీడీపీ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి స్పందించారు. తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక జెరూసలేం, చంద్రన్న పథకాలను టీడీపీ హయాంలోనే ముద్రించారని విజయసాయిరెడ్డి తెలిపారు.

ఇప్పుడు ఏమీ తెలియనట్లు అన్యమత ప్రచారం అని విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మూడు నెలలకే ఇంతలా బట్టలు చించుకుంటే చంద్రబాబు మిగిలిన ఐదేళ్లు ఎలా తట్టుకుంటారని ప్రశ్నించారు. ఏదేమైనా చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనని ఎద్దేవాచేశారు.

Related posts