telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇక చంద్రబాబు కుంభకోణాలన్ని వెలుగులోకి వస్తాయి: విజయసాయి

Vijayasai reddy ycp

మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ లో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఓ ద్రోహి అని, తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు కోసం అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందని పేర్కొన్నారు. చంద్రబాబు పాల్పడిన అక్రమాలన్నీ ఈ దర్యాప్తుతో వెలుగులోకి వస్తాయని తెలిపారు

చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడం వెనుక చంద్రబాబు రహస్య అజెండా, కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు, స్వార్థ ప్రయోజనాలు అన్నీ బయటికి వస్తాయని విజయసాయి ట్వీట్ చేశారు.

Related posts