పెళ్ళి చూపులు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ విజయ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత “నోటా” సినిమాతో డీలాపడినా, “టాక్సీవాలా”తో మళ్ళీ తన సత్తా చాటుకున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందంటే… బాలీవుడ్ కు కూడా పాకింది. స్వయంగా ప్రముఖ నటి శ్రీదేవి కూతురే విజయ్ దేవరకొండతో సినిమా చెయ్యాలని ఉందని చెప్పింది. దీన్నిబట్టి విజయ్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ అండర్ 30లో స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా తన ఆరో ఎడిషన్ ను ప్రకటించింది.
#ForbesIndia30U30 | Class of 2019 – Entertainment & Music: Vijay Deverakonda (@TheDeverakonda), Actor https://t.co/vyoCQZxvAY pic.twitter.com/QUa8sQZ2xK
— Forbes India (@forbes_india) February 4, 2019
అందులో ఇండియాకు చెందిన 30 ఏళ్ళలోపు వయసున్న వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ ను ఎంపిక చేసింది ఫోర్బ్స్. అందులో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండకు చోటు దక్కడం విశేషం. విజయ్ దేవరకొండ వయసు 29 సంవత్సరాలు. ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్ కేటగిరీలో విజయ్ని ఎంపిక చేసినట్టు సమాచారం. “అర్జున్ రెడ్డి” సినిమా బ్లాక్బస్టర్తో విజయ్ దేవరకొండ తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. అంతేకాదు విజయ్ సినిమా కెరీర్కు “అర్జున్ రెడ్డి” ఓ కీలక మలుపు అని అభివర్ణించింది. ఈ కేటగిరీలో విజయ్తో పాటు యూట్యూబర్ ప్రజక్తా కొలి (25), సింగర్ మేఘనా మిశ్రా (17) లను ఫోర్బ్స్ ఎంపిక చేసింది.
#ForbesIndia30U30 Class of 2019: The results are now LIVE! Young, fresh and poised to disrupt, the full list of achievers is here: https://t.co/vyoCQZP6Zy pic.twitter.com/0N39Wqd4nu
— Forbes India (@forbes_india) February 4, 2019
Sensational @TheDeverakonda in @Forbes under 30, a star evolves #ForbesIndia30U30 pic.twitter.com/w0lkmoRuxh
— BARaju (@baraju_SuperHit) February 4, 2019