హీరోగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ తొలిసారి నిర్మాతగా మారి “మీకు మాత్రమే చెప్తా” అనే సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. షమీర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అవంతికా మిశ్రా కథానాయికగా నటిస్తుంది. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నేడు గ్రాండ్గా విడుదలైంది. గత కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న విజయ్ దేవరకొండ ఈ రోజు ఏకంగా ఐమాక్స్ థియేటర్లోని కౌంటర్లో టికెట్లు అమ్మాడు. విజయ్ టిక్కెట్ అమ్ముతున్న విషయం తెలసుకొని జనాలు ఎగబడ్డారు. “మీకు మాత్రమే చెప్తా” చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించింది. ఈ నేపథ్యంలో విజయ్కి నిర్మాతగా తొలి విజయం దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
previous post