telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడవుల్లో ఎంజాయ్ చేస్తున్న విద్యా బాలన్!

విద్యా బాలన్ నెక్ట్స్ తెరపై కనిపించబోయే సినిమా ‘షేర్నీ’. దట్టమైన అడవుల మధ్య నరమాంసానికి అలవాటు పడ్డ ఒక పులిని పట్టుకోవటమే సినిమాలోని కథ. క్రూర జంతువుని ఎదుర్కొనే అటవీశాఖ అధికారిణిగా విద్యా నటించింది. అనుక్షణం థ్రిల్ కలిగించే కథతో దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ సినిమాని రూపొందించాడు. అయితే, జూన్ 18న అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న డీప్ ఫారెస్ట్ ఎంటర్టైనర్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టటం విశేషం…

‘షేర్నీ’ సినిమా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో షూట్ చేశారు. ముఖ్యంగా, అక్కడి అరణ్యాలు, గిరిజన ప్రాంతాలు విరివిగా కెమెరాలో బంధించారు. అందుకే, రానున్న రోజుల్లో ఎంపీ ప్రభుత్వం ‘షేర్నీ’ నటీనటులు, టెక్నీషియన్స్ తో పలు కార్యక్రమాలు రూపొందించనుంది. వాటి ద్వారా తమ రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం ఏర్పడుతుందని మధ్యప్రదేశ్ టూరిజమ్ అఫీషియల్స్ చెబుతున్నారు. విద్యా బాలన్ తో పాటూ సినిమా దర్శకుడు, ఇతర సెలబ్రిటీస్ ఆ రాష్ట్రంలో చీత్రకరణ జరిపినప్పుడు తమకు కలిగిన అనుభవాలు, అనుభూతులు పంచుకోనున్నారు. 

మధ్యప్రదేశ్ లోని దట్టమైన, అందమైన అడవులు, అక్కడి గిరిజనుల మధ్య షూటింగ్ ఓ మరిచిపోలేని అనుభూతి అన్న విద్యా బాలన్ ప్రచార కార్యక్రమాలు ఎలా ఉంటాయో స్పష్టంగా చెప్పలేదు. కానీ, ‘షేర్నీ’ విడుదలకు ముందు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎంపీ టూరిజమ్ శాఖతో కలసి పని చేయబోతున్నట్టు ఆమె వివరించారు. రకరకాల స్థాయుల్లో అనేక కార్యక్రమాలు చేపడతామని అధికారులైతే అంటున్నారు. చూడాలి మరి, ‘షేర్నీ’ మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకి ఎలా ఉపయోగపడుతుందో…

Related posts