telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా కల్లోలం : పీఎం మోడీ కీలక సమావేశం

కరోనా కట్టడిలో భాగంగా ఇవాళ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ… వివిధ రాష్ట్రాల గవర్నలతో సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కరోనా వచ్చాక.. ఇలాంటి మీటింగ్ జరగడం ఇదే తొలిసారి. వర్చువల్ విధానంలో జరిగే ఈ మీటింగ్ ద్వారా… ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించేలా చేయాలనీ గవర్నలను ప్రధాని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. కరోనా నియమ నిబంధనలను కచ్చితంగా అమలు అవ్వాలని కేంద్రం… రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమావేశం కీలకం కాబోతుందని తెలుస్తోంది. కాగా ఇదివరకే రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ.. వర్చువల్ మీటింగ్ పెట్టి.. కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో కరోనా విలయం మరింత ఉదృతం అవుతోంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 1,85,190 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదవగా 1026 మంది మృతి చెందారు. గడచిన 6 నెలల తరువాత దేశంలో అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదు కావడం గమనార్హం. గడచిన 24 గంటలలో మహారాష్ట్రలో 60,212 కొత్త “కరోనా” కేసులు, ఉత్తర ప్రదేశ్ 18,021 కేసులు, ఢిల్లీలో 13,468 కొత్త “కరోనా” కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటలలో మహారాష్ట్రలో గరిష్ట ప్రాణనష్టం (281) నమోదు కాగా… ఉత్తరప్రదేశ్ లో 85 మంది మృతి చెందగా, ఢిల్లీ లో 81 మరణాలు నమోదు అయ్యాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 12 నాటికి దేశంలో మొత్తం 25,92,07,108 నమూనాలను పరీక్షించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,38,52,599 కేసులు నమోదు కాగా, 1,71,929 మరణాలు నమోదు అయ్యాయి.

Related posts