టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. స్కూళ్ల పక్కనే వైన్ షాపులు ఏర్పాటు చేశారని తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వైన్ షాపుల నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సగం ఇచ్చినా ఫీజు రీయింబర్స్ మెంట్ చేయొచ్చని అన్నారు.
కొత్త సచివాలయం అంశంపై స్పందిస్తూ, ప్రగతిభవన్ లో కూర్చోవచ్చు కదా, కొత్త సెక్రటేరియట్ ఎందుకని ప్రశ్నించారు. పిల్లలు చదువుకునే అవకాశం లేని రాష్ట్రం తెలంగాణే అని విమర్శించారు. విద్యార్థుల ఉసురు పోసుకోవద్దని హితవు పలికారు. గతంలో ఇంటికో ఉద్యోగం అన్నారు… ఆ విషయం ఏమైంది? అంటూ ప్రశ్నించారు. .