telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌కు గర్వం తగ్గించాలని దేవుడిని మొక్కుతున్నా: వీహెచ్‌

Congress Hanmanth Rao Governor TRS agent

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత్ రావు ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు 26 మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌కు ఎలాంటి బాధ లేదన్నారు. హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఇంతవరకు బాధితకుటుంబాలను ప్రభుత్వం పరామర్శించలేదని వీహెచ్‌ మండిపడ్డారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ తన నియోజక వర్గంలో కార్యకర్త చనిపోతే వెళ్లి పాడే మోసిందని గుర్తు చేశారు. మరి, నీకు ఓట్లు వేసిన హజీపూర్ ప్రజలకు నువ్వు ఏం చేశావంటూ కేసీఆర్‌పై వీహెచ్‌ విరుచుకుపడ్డారు. మొన్నటి లోక్ సభ ఎన్నిక్ల ఫలితాలతో కేసీఆర్‌కు అహంకారం సగం తగ్గిందన్నారు. కేసీఆర్‌కు గర్వం పూర్తిగా తగ్గించాలని తిరుపతి దేవుడిని మొక్కుతున్నానని తెలిపారు. వారం లోపు కేసీఆర్ హజీపూర్‌కు వెళ్లి అక్కడ బాధితులను ఆదుకోవాలని వీహెచ్‌ డిమాండ్ చేశారు.

Related posts