telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో రాసి ఉందా?: వీహెచ్

hanmanth rao congress

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఘాటుగా స్పందించారు. వామపక్షాలు ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా నాంపల్లి కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికుడికీ ఉందని తెలిపారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నించారు.

ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకే ఆ సంస్థకు చెందిన కార్మికులను కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డుమీదకు తీసుకొచ్చిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు, మరి ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారని వీహెచ్ నిలదీశారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందకపోతే వారి కుటుంబాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. తాను ఒక్కడే బాగుండాలని, మిగతా వారందరూ ఇబ్బందులు పడాలని కేసీఆర్ భావిస్తున్నారా? అని నిలదీశారు.

Related posts