telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ రాజధాని సమస్యపై కేంద్రం స్పందించాలి: వీహెచ్

hanmanth rao congress

ఏపీలో  మూడు రాజధానుల విధానంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. రాజధానుల నిర్ణయం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా కూడా మూడు రాజధానుల పద్ధతి లేదని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకే నిధులు లేవని.. ఇక మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సలహాతోనే ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు అంటున్నారని దుయ్యబట్టారు.

Related posts