telugu navyamedia
రాజకీయ వార్తలు

సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలి: వెంకయ్య

Venkaiah-Naidu

సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందిపై కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, రాం విలాస్ పాశ్వాన్ తో చర్చించారు. వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, ఆయా శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. రైతుల బకాయిలను విడుదల చేయాలని మంత్రులకు, అధికారులకు సూచించారు.

ధాన్యం సేకరణ, రైతులకు నగదు చెల్లింపుల్లో ఆలస్యం వద్దని, సమయానికి డబ్బు ఇవ్వకుంటే రైతు నష్టపోతాడని తెలిపారు. కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు సరిగా అందడం లేదన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లిన వెంకయ్యనాయుడు, ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల గురించి ప్రస్తావించినట్టు సమాచారం.

Related posts