telugu navyamedia
రాజకీయ వార్తలు

 భక్తులతో కలిసి ఉపరాష్ట్రపతి భోజనం

Venkaiah-Naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు ఉదయం కుటుంభంతో  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి వెళ్లిన వెంకయ్యనాయుడుకు మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం నేటి మధ్యాహ్నం ఆయన తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సాధారణ భక్తులతో కలిసి సామూహిక భోజనం చేశారు. భక్తులకు మంచి రుచికరమైన, నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్న టీటీడీ అధికారులను ఆయన ప్రశంసించారు.  వీఐపీలు  ఏడాదికి ఒక్కసారే స్వామి వారిని దర్శించుకోవాలని, దీంతో సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉంటుందని  వెంకయ్య సూచించారు.

Related posts