telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మహాశివరాత్రి స్పెషల్ .. వేములవాడకు హెలికాప్టర్

helicopter

రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులు నడపాలని నిర్ణయించుకుంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ హెలికాప్టర్ సేవలకు రంగంలోకి దిగింది.

హెలికాప్టర్ సర్వీసులను తెలంగాణ టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. ఫిబ్రవరి 23 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చార్జీగా నిర్ణయించారు. అయితే ఒక ట్రిప్పుకు కనీసం ఐదుగురు ప్రయాణికులు ఉండాలి. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి వేములవాడ తీసుకెళ్లి దర్శనానంతరం తిరిగి హైదరాబాద్ తీసుకొస్తారు.

Related posts