telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రీఫ్డ్ మి కేసులో త్వరలో చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయం….

vellampalli srinivas ycp

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రీఫ్డ్ మి కేసులో త్వరలో చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని… చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు దేవాలయాలను కూల్చిన దుర్మార్గుడని ఫైర్‌ అయ్యారు. గోవులకు నిలువ నీడ లేకుండా చేసిన చరిత్ర చంద్రబాబుదని.. కాలుకు బూట్ల వేసుకుని చంద్రబాబు పూజ చేసిన విషయం ప్రపంచం అంతా చూసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి సంక్షేమ పథకాలతో మంచి పేరు వస్తోందని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడన్నారు. తిరుమల తిరుపతి లో వెయ్యి స్థంభాల మండపం కూల్చింది చంద్రబాబు కాదా? ఇప్పుడు రామతీర్థం వెళ్లి ముసలి కన్నీరు కారుస్తున్నాడని నిలదీశాడు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి సిగ్గు లేదా? చంద్రబాబును మనిషిగానే పరిగణించటం లేదని ఫైర్‌ అయ్యారు. ఈ దేవాలయానికి ఇప్పటి వరకు ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు ఎందుకు నోరు విప్పలేదని.. ఆయనకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఒక కార్పొరేటర్ గా కూడా గెలవలేకపోయిన లోకేష్… జగన్ కు సవాలు విసిరే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమని.. తండ్రి, కొడుకులకు డిపాజిట్లు కూడా దక్కవని తెలిపారు. జగన్ ను ఒక్క మాట అన్నావంటే ఖబడ్దార్..పప్పు నాయుడుకు ఆరోపణలు నిరోపించాలని సవాలు విసిరితే పారిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts