మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికార విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం మొదలైంది. ఇప్పటికే చంద్రబాబు డెడ్ లైన్లతో హోరెత్తిస్తుండగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చంద్రబాబుకు ప్రతి సవాల్ విసిరారు. కలలు సాకారం కావాలంటే చంద్రబాబు ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
“ఇప్పటికైనా విమర్శలు మానుకుని, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం జగన్ కు సహకరిస్తారో… లేక మీరు, మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల తీర్పుకోరతారో తేల్చుకోవాలి” అంటూ వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఈ మేరకు ‘డెడ్ లైన్ల బాబుకు వెల్లంపల్లి సవాల్’ అంటూ ట్వీట్ చేశారు.