telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కోవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ కు వెలంపల్లి…

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీలో 7.67 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ కరోనా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ నాయకులకు మరీ ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈయన ఇటీవలే తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంతో పాటు హాజరు అయ్యారు. ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణకు కూడా కోవిడ్ సోకింది. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నంటే ఈ ఇద్దరు మంత్రులూ ఉన్నారు. అయితే ఇన్ని రోజులు ఏపీలో చికిత్స తీసుకున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసును హైదరాబాదుకు తరలిస్తున్నారు. కోవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ అపొలోలోకు వెలంపల్లి వస్తున్నారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గం అనువుగా లేకపోవడంతో హెలీకాప్టరులో వెలంపల్లిని హైదరాబాదుకు తరలిస్తున్నారు.

Related posts