సికింద్రాబాద్ ప్రాంతంలో నంబర్ పేట్లు లేని వాహనాలతో ఇష్టానుసారంగా తిరిగిన వారి పై పోలీసులు కేసులు నమోదు చేశారు. నంబర్ పేట్లు లేకుండా వాహనాలను నడిపిన 9 మందికి జైలు శిక్షతో పాటు, జరిమానాను సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆవరణలోని 15 స్పెషల్ ఎంఎం న్యాయస్థానం విధించింది. మారేడ్పల్లి పోలీసుల కథనం ప్రకారం…ఇటీవల మారేడ్పల్లి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టారు.
ఇందుతో 9 మంది వాహనాదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతుండడాన్ని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరిచారు. ఈ మేరకు గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి సికింద్రాబాద్కు చెందిన వెంకటేశ్కు రెండు రోజుల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయలు, మరో 8 మందికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.50 జరిమానాను విధించారు.