బోల్డ్ హీరోయిన్ అమలాపాల్ ఇటీవలే “ఆమె” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నగ్నంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే అమలాపాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. కేరళలో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా పత్రాన్ని చూపి లగ్జరీ కారు కొన్నదంటూ అమలాపాల్పై పలు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ తప్పదనే వార్తలు కూడా వినిపించాయి. రూ.20 లక్షలు ఎగ్గొట్టి చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడిన అమలాపాల్పై చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అప్పట్లో ఆదేశించారు. దీనిపై సెక్షన్ 430 – 468 – 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన క్రైమ్ బ్రాంచ్… ఇష్యూ జరిగింది పుదుచ్చేరిలో… కేసు ఫైల్ అయింది కేరళలో. కాబట్టి ఇది మా పరిధిలోకి రాదంటూ కేరళ పోలీసులు కేసు కొట్టేసినట్టు తెలుస్తుంది. దీంతో అమలాపాల్ కు ఈ కేసు నుండి ఊరట లభించింది.
previous post