telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దోషులకు పడిన శిక్షను స్వాగతిస్తున్నా: వాసిరెడ్డి పద్మ

vasireddy padma ycp

వెటర్నరీ డాక్టర్ దిశ నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై పలువురు హర్షిస్తున్నారు. ఈ విషయం పై తాజాగా ఏపీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. శుక్రవారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ.. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని వ్యాఖ్యానించారు. దిశకు సత్వర న్యాయం జరిగిందంటూ దోషులకు పడిన శిక్షను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌తో వైఎస్సార్‌ హయాంలో జరిగిన సంఘటన మరొకసారి గుర్తుకు వచ్చిందని వెల్లడించారు. స్త్రీలపై జరుగుతున్న పాశవిక దాడులకు ప్రతిగా ఈ ఎన్‌కౌంటర్‌ కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. నిందితులకు పడిన శిక్ష పట్ల దేశ ప్రజలు హర్షిస్తున్నారనీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టాల్లో మార్పు రావాలని ఆమె అన్నారు.

Related posts