కొద్ది రోజుల క్రితం ముంబై నగరంలో నిసర్గ తుఫాను కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితులలో బయటకి రాకుండా ఇంట్లో ఉండడమే మంచిదని వరుణ్ ధావన్ తన అభిమానులకి సూచిస్తున్నారు. వరుణ్ ధావన్ గొడుగుతో బయటకి వచ్చి అక్కడ పరిస్థితులని వీడియో ద్వారా చూపించాడు. “ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు. చాలా చెట్లు నెలకొరిగాయి. మీరు వర్షంలో తడిసి ముద్ద కావాలి అంటే బయటకి రావచ్చు. కాని ఇది హేయమైన చర్య” అంటూ వరుణ్ ధావన్ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం తన ఆంటీ కన్నుమూసారని, ఆమె ఆత్మకి శాంతి కలిగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. త్వరలో కూలీ నెం 1 చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ తుఫాను వలన చాలా మంది నిరాశ్రయిలయ్యారు. చెట్లు నెలకొరిగాయి. భవనాలు ధ్వంసమయ్యాయి. నిసర్గ తుఫాను భీభత్సం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
previous post
విజయ్ సేతుపతి సినిమాలో సమంత నటించడానికి అసలు కారణం ఇదే…!